'ఆహా' ఆఫర్.. ఉచితంగా 'మిస్టర్ పెళ్లాం' డైలీ సిరీస్!
on Dec 1, 2022
షోలు, సిరీస్ లు, సినిమాలతో అలరిస్తున్న ఓటీటీ వేదిక 'ఆహా' సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. తెలుగులో ఓ డెయిలీ సిరీస్ను అందిస్తుంది. దీని ద్వారా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్తో పాటు కొత్త యూజర్స్ కి సైతం వినోదాన్ని పంచనుంది.
ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు 'మిస్టర్ పెళ్లాం' అనే డెయిలీ తెలుగు సిరీస్ను ఆహా ఫ్రీగా అందిస్తుంది. ఈ డెయిలీ సిరీస్ ను 'కార్తీక దీపం' మేకర్స్ రూపొందిస్తుండటం విశేషం. ఇది నవంబర్ 28 నుంచి ప్రసారమవుతోంది. మహిళా ప్రేక్షకులను అలరించేందుకు ఈ డెయిలీ సిరీస్ను తీసుకొచ్చినట్టు ఆహా చెబుతోంది.
'మిస్టర్ పెళ్లాం' డెయిలీ సిరీస్ భవ్య (పూజా మూర్తి), నివాస్(అమర్ దీప్), రేఖ (సోనియా) అనే ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథ. తనను తనలాగా ప్రేమించే భర్త కోసం భవ్య కలలు కంటుంటుంది. నివాస్ ధనవంతురాలిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలనుకుంటాడు. భవ్య దగ్గర పని చేసే రేఖ డబ్బులను పట్టించుకోకుండా అపరిమితమైన ప్రేమ చూపించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది. వీరు ముగ్గురు ఒకటి తలిస్తే విధి మరోలా తలిచింది. విధి ఆడిన నాటకంలోని ట్విస్టులతో ముగ్గురు ఒకరితో ఒకరు ముడిపడతారు. భవ్య, రేఖ నిజంగానే వారు కోరుకుటన్నట్లు నిజమైన ప్రేమను పొందుతారా? వీరి ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందో తెలియాలంటే ఉచితంగా 'మిస్టర్ పెళ్లాం' చూసి తెలుసుకోండి అంటోంది ఆహా.
Also Read